సమీకృత బీబీఏ-ఎంబీఏ కోర్సుకు దరఖాస్తు గడువు పెంపు
ABN , First Publish Date - 2020-12-18T05:10:51+05:30 IST
సమీకృత బీబీఏ-ఎంబీఏ కోర్సుకు దరఖాస్తు గడువు పెంపు

ఏయూ క్యాంపస్, డిసెంబరు 12: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహించే ఐదేళ్ల సమీకృత బీబీఏ-ఎంబీఏ కోర్సుకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 19 వరకు పొడిగించినట్టు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఏ నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 21న గ్రూప్ డిస్కషన్, ప్యానల్ ఇంటర్వ్యూలు నిర్వహించి సీట్లు కేటాయిస్తామన్నారు. 23 నుంచి 25వ తేదీ వరకు ఫీజులు చెల్లించాలని, 26 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.