పథకాల అమలుపై సీఆర్‌డీ బృందం పరిశీలన

ABN , First Publish Date - 2020-12-06T06:19:19+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, వాటి వలన చేకూరుతున్న లబ్ధితోపాటు ఉపాధి పథకం ద్వారా మరింత లబ్ధి చేకూర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై శనివారం మండలంలో సీఆర్‌డీ బృందం పరిశీలన జరిపింది.

పథకాల అమలుపై సీఆర్‌డీ బృందం పరిశీలన
కిత్తలోవలో ప్రజలతో సమావేశమైన బృందం


కొయ్యూరు, డిసెంబరు 5: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, వాటి వలన చేకూరుతున్న లబ్ధితోపాటు ఉపాధి పథకం ద్వారా మరింత లబ్ధి చేకూర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై శనివారం మండలంలో సీఆర్‌డీ బృందం పరిశీలన జరిపింది. కేంద్రం ఏర్పాటుచేసిన ఈ కమిటీలో రాష్ట్ర   ప్రతినిధులు రోషిణి, బలరాంతో కూడిన బృందం శనివారం కొమ్మిక పంచాయతీ కిత్తలోవ, బట్టపణుకుల పంచాయతీలను సందర్శించింది. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారి ఆర్థిక స్థితిగతులతోపాటు ఉపాధి హామీ పథకం మరింత విస్తృత పరచి ప్రజలకు మరింత ఉపాధి కల్పనకు ఏ విధమైన పనులు నిర్వహించాలనే విషయాలపై బృందం ప్రజలతో చర్చించింది. ఈ బృందం వెంట ఉపాధి హామీ మండల ఏపీవో రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T06:19:19+05:30 IST