నాన్‌షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలి

ABN , First Publish Date - 2020-12-02T05:28:46+05:30 IST

నాన్‌షెడ్యూల్‌ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు.

నాన్‌షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలి
ఆర్టీసీ కాంఫ్లెక్స్‌ వద్ద రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు


రాస్తారోకోలో సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం డిమాండ్‌


పాడేరురూరల్‌, డిసెంబరు 1: నాన్‌షెడ్యూల్‌ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. మంగళవారం వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో సీపీఎం నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. నాన్‌షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని, డుంబ్రిగుడ మండలంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కిల్లో సురేంద్ర, బి.చిన్నయ్యపడాల్‌, డి.గంగరాజు, బి.సన్నిబాబు, ఎల్‌.సుందరరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-02T05:28:46+05:30 IST