207 రోజుల తరువాత కనిష్టానికి కేసులు..

ABN , First Publish Date - 2020-12-29T06:31:41+05:30 IST

: జిల్లాలో 207 రోజుల తరువాత కనిష్ట స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

207 రోజుల తరువాత కనిష్టానికి కేసులు..

జిల్లాలో అత్యల్పంగా 13 మందికి కొవిడ్‌ నిర్ధారణ

చికిత్స పొందుతూ మరొకరు మృతి

విశాఖపట్నం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 207 రోజుల తరువాత కనిష్ట స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మూడున్నర నెలల కిందట జూన్‌ ఐదో తేదీన ఐ దు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆ తరువాత నుంచి కేసులు పెరుగుతూ వచ్చాయి. తరువాత మళ్లీ ఇన్నాళ్లకు సోమవారం అతి తక్కువగా 13 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 59,579కు చేరాయి. వీరిలో వైరస్‌ నుంచి 58,804 మంది కోలుకోగా, మరో 253 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ సోమవారం ఒకరు మృతి చెందగా, జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాలు 522కు చేరాయి. 


Updated Date - 2020-12-29T06:31:41+05:30 IST