-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » corona
-
59 వేలకు చేరిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-10T05:38:53+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 59 వేలకు చేరాయి. తాజగా బుధవారం 44 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,042కు చేరాయి

జిల్లాలో తాజాగా మరో 44 మందికి వైరస్
విశాఖపట్నం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 59 వేలకు చేరాయి. తాజగా బుధవారం 44 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,042కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి 58,239 మంది కోలుకోగా, మరో 289 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు వైరస్తో చికిత్స పొందుతూ 514 మంది మృతి చెందారు.