మరో 53 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-11-19T05:41:05+05:30 IST
జిల్లాలో బుధవారం మరో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
![మరో 53 కరోనా కేసులు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020111912092784/11192020000950n63.jpg)
జిల్లాలో 57,960కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య
విశాఖపట్నం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బుధవారం మరో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 57,960కు చేరింది. వైరస్ నుంచి బుధవారం 102 మంది కోలుకున్నారు. కాగా బుధవారం జిల్లాలో కొవిడ్ మరణాలు సంభవించలేదు. జిల్లాలో కొత్తగా యాక్టివ్ క్లస్టర్లు కూడా నమోదు కాలేదు.