ఇంటింటా సర్వేపై కలెక్టర్ తనిఖీలు
ABN , First Publish Date - 2020-04-26T09:42:05+05:30 IST
నాలుగో విడత ఇంటింటా సర్వే పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్ వినయ్చంద్ అధికారులను ఆదేశించారు.

19వ వార్డులో స్వయంగా వివరాలు సేకరణ
సిబ్బంది పనితీరుపై ఆరా
మహారాణిపేట: నాలుగో విడత ఇంటింటా సర్వే పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్ వినయ్చంద్ అధికారులను ఆదేశించారు. శనివారం వివిధ వార్డులలో జరుగుతున్న సర్వే తీరును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. 19వ వార్డులో కొన్ని ఇళ్ల వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి ఆయా గృహ యజమానులతో మాట్లాడారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నాయా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సర్వే టీమ్లు వస్తున్నదీ, లేనిదీ ఆరా తీశారు. సమస్యలు ఉంటే సచివాలయ సిబ్బందికి లేదా ట్రోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ పర్యటనలో డీఎంహెచ్వో డాక్టర్ తిరుపతిరావు, ఆంధ్రవైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్, సబ్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.