-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Boiler prayer for sugars crashing
-
గోవాడలో 3న క్రషింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-27T05:37:07+05:30 IST
గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో వచ్చే నెల 3న క్రషింగ్ ప్రారంభిస్తామని ఎండీ వి.సన్యాసినాయుడు తెలిపారు. కర్మాగారంలో గురువారం ఉదయం 5.30 గంటల ముహూర్తానికి బాయిలర్ను వెలిగించారు.

షుగర్ ఫ్యాక్టరీ ఎండీ సన్యాసినాయుడు
చోడవరం, నవంబరు 26: గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో వచ్చే నెల 3న క్రషింగ్ ప్రారంభిస్తామని ఎండీ వి.సన్యాసినాయుడు తెలిపారు. కర్మాగారంలో గురువారం ఉదయం 5.30 గంటల ముహూర్తానికి బాయిలర్ను వెలిగించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ, ఈ ఏడాది నాలుగున్నర లక్షల టన్నులు చెరకు క్రషింగ్ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. బాయిలర్ పూజలో ఫ్యాక్టరీ ఏవో పప్పల రమణమూర్తి, సీసీ ప్రసాద్, వ్యవసాయాధికారులు మల్లికార్జునరెడ్డి, ప్రసాదరావు, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు శరగడం రామునాయుడు, రాయి సూరిబాబు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.