-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » BJP AGITATION
-
రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టిసారించాలి
ABN , First Publish Date - 2020-12-06T05:41:43+05:30 IST
రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్ ఆరోపించారు.

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్
ఎంవీపీ కాలనీ, డిసెంబరు 5: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్ ఆరోపించారు. రోడ్ల దుస్థితిపై శనివారం ఎంవీపీ కాలనీలోని టీటీడీ కల్యాణ మండపం సర్కిల్లో బీజేపీ నాయకులు నిరసర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మోహన్ మాట్లాడుతూ రహదారుల దుస్థితిపై ప్రభుత్వం దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి కాటూరి రవీందర్, బీజేపీ అధికార ప్రతినిధి సుహాసినీ ఆనంద్తో పాటు పలు కార్యకర్తలు పాల్గొన్నారు.