-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » awarness to people for covid
-
కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-12-07T05:09:03+05:30 IST
కొవిడ్ రెండో దశలో ఉన్నందున జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని డీఆర్డీఏ పీడీ విశ్వేశ్వరరావు సూచించారు.

డీఆర్డీఏ పీడీ విశ్వేశ్వరరావు
పెందుర్తి, డిసెంబరు 6: కొవిడ్ రెండో దశలో ఉన్నందున జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని డీఆర్డీఏ పీడీ విశ్వేశ్వరరావు సూచించారు. పెందుర్తిలోని జిల్లా మహిళా సమాఖ్య కేంద్రంలో ఆదివారం జిల్లా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆయన కొవిడ్- 19పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కొవిడ్ నియంత్రణకు చర్యలు చేపడతామని ప్రతిజ్ఞ చేయించారు.