చంద్రబాబు గిరిజనుల ద్రోహి : అరకు ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-07-19T01:01:43+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల ద్రోహి అని అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆరోపించారు.

విశాఖపట్నం : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల ద్రోహి అని అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆరోపించారు. శనివారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు మోసం చేశారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు మంత్రులు.. ఉప ముఖ్యమంత్రి పదువులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అప్పుడు గిరిజనులకు దివంగత సీఎం వైఎస్ భూములకు పట్టాలిస్తే.. ఇప్పుడు సీఎం జగన్ నాలుగింతల భూమి పట్టాలు ఇచ్చి గిరిజనుల జీవితాలను మార్చేస్తున్నారని చెట్టి వ్యాఖ్యానించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో బాక్సైట్ పేరిట గిరిజనుల ఆస్తులను దోచుకోవడానికే చంద్రబాబు ప్రయత్నించారని అరకు ఎమ్మెల్యే మండిపడ్డారు.