బలరాముడిగా అప్పన్న స్వామి
ABN , First Publish Date - 2020-12-29T05:32:40+05:30 IST
రాపత్తు ఉత్సవాల్లో భాగంగా సోమవారం వరాహలక్ష్మీనృసింహస్వామి సోమవారం సాయంత్రం భక్తులకు బలరాముడిగా దర్శనమిచ్చారు.
సింహాచలం, డిసెంబరు 28: రాపత్తు ఉత్సవాల్లో భాగంగా సోమవారం వరాహలక్ష్మీనృసింహస్వామి సోమవారం సాయంత్రం భక్తులకు బలరాముడిగా దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బలరాముడిగా స్వర్ణాభరణాలతో అలంకరించి పల్లకిలో ఉంచి తొలుత ఆలయ బేడా మండపంలో, ఆ తర్వాత సింహగిరి మాడవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్టీలు వారణాసి దినేశ్రాజ్, మాధవి, పర్యవేక్షణాధికారి వి.కామేశ్వరరావు స్థానాచార్యులు డాక్టర్ టీపీ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.