వెలుగు ఏపీడీగా మురళీ బాధ్యతల స్వీకారం
ABN , First Publish Date - 2020-11-28T05:24:35+05:30 IST
వెలుగు స్థానిక ఏపీడీగా వి.మురళీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
పాడేరు, నవంబరు 27: వెలుగు స్థానిక ఏపీడీగా వి.మురళీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు ఇక్కడ ఏపీడీగా పనిచేసిన నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ కాగా, విజయనగరం జిల్లాల్లో పనిచేస్తున్న మురళీని ఇక్కడ ఏపీడీగా ప్రభుత్వం నియమించింది. ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిసి, అనంతరం ఏపీడీగా మురళీ బాధ్యతలు స్వీకరించారు.