దేశం గర్వించదగ్గ మేధావి అంబేడ్కర్
ABN , First Publish Date - 2020-12-07T06:03:38+05:30 IST
దేశం గర్వించదగ్గ మేధావుల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఒకరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి
డాబాగార్డెన్స్, డిసెంబరు 6: దేశం గర్వించదగ్గ మేధావుల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఒకరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా డాబాగార్డెన్స్లోని విగ్రహానికి ఆదివారం ఆయన, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పూలమాలలువేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, వాసుపల్లి గణేశ్కుమార్, శెట్టి ఫల్గుణ, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, మత్స్యకార కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కోలా గురువులు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు బోని శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.