రజకులు వినూత్న నిరసన
ABN , First Publish Date - 2020-12-10T05:40:26+05:30 IST
బలిఘట్టం రెవెన్యూ పరిధి బయపు రెడ్డిపాలెం సర్వే నంబరు 510లో తాము దుస్తులు ఉతికి ఆరబెట్టుకునే స్థలంలో ఆక్రమణలను తొలగించాలంటూ రజకులు బుధ వారం వినూత్న నిరసన తెలిపారు.
![రజకులు వినూత్న నిరసన](https://media.andhrajyothy.com/appimg/galleries/2020121012075582/12102020000902n81.jpg)
బట్టలు ఆరబెట్టుకునే స్థలంలో ఆక్రమణలు తొలగించాలని డిమాండ్
తహసీల్దార్ కార్యాలయం వద్ద చాకిరేవు
నర్సీపట్నం, డిసెంబరు 9 : బలిఘట్టం రెవెన్యూ పరిధి బయపు రెడ్డిపాలెం సర్వే నంబరు 510లో తాము దుస్తులు ఉతికి ఆరబెట్టుకునే స్థలంలో ఆక్రమణలను తొలగించాలంటూ రజకులు బుధ వారం వినూత్న నిరసన తెలిపారు. రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద చాకిరేవు పెట్టారు. ఈ సం దర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలమండ వరహాలరాజు మాట్లాడుతూ రజకులు తమ సమస్యపై గతంలో సబ్ కలెక్టర్, తహసీల్దార్కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అదీకాక ఫిర్యాదు చేసినందుకు ఆక్రమణదారుడు తమను బెదిరిస్తున్నారని పలువురు వాపోయారు. ఈ సమస్యపై ఇప్పటికైనా స్పం దించాలని కోరారు. సీపీఎం నాయకుడు కె.గోవిందరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.