మద్యం మత్తులో బావిలో మునిగి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-29T05:40:51+05:30 IST
మద్యం మత్తులో బావిలో ఈతకు దిగిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వెంకటాపురంలో సోమవారం జరిగింది.
గోపాలపట్నం, డిసెంబరు 28: మద్యం మత్తులో బావిలో ఈతకు దిగిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వెంకటాపురంలో సోమవారం జరిగింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 92వ వార్డు వెంకటాపురం గ్రామానికి చెందిన డెంకాడ వెంకట సుబ్బారావు (36) సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. సోమవారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి మద్యం సేవించి గ్రామశివారులోని నేల బావిలో ఈతకు దిగాడు. మత్తులో ఉండి మునిగిపోవడంతో మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. సీఐ మళ్ల అప్పారావు ఆధ్వర్యంలో ఎస్ఐ రఘురామ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.