సచివాలయ పరీక్షలకు 427 ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2020-09-19T09:15:15+05:30 IST
గ్రామ/వార్డు సచివాలయం పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి జరుగనున్న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల రవాణాకు ప్రజా రవాణా శాఖ(పీటీడీ) బ
60 శాతం సీటింగ్కు అనుమతి
ద్వారకాబస్స్టేషన్, సెప్టెంబరు 18 : గ్రామ/వార్డు సచివాలయం పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి జరుగనున్న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల రవాణాకు ప్రజా రవాణా శాఖ(పీటీడీ) బస్సులు సన్నద్ధమయ్యాయి. పీటీడీ విశాఖ రీజియన్ యాజమాన్యం ఇందుకు 427 బస్సులను సిద్ధం చేసింది. సచివాలయం పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలోనే ఎక్కువ బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు.
ఈమేరకు రూట్ ప్లాన్ను సిద్ధం చేసుకున్నారు. కొవిడ్-19 దృష్ట్యా బస్సుల్లో 60 శాతం సీటింగ్కు మించకుండా ప్రయాణికులను అనుమతించాలి నిర్ణయం తీసుకున్నట్టు రీజనల్ మేనేజర్ ఎంవై దానం తెలిపారు. ప్రతి ప్రయాణికుడు మాస్క్ను తప్పని సరిగా ధరించాలని ఆర్ఎం సూచించారు.
పరీక్షలకు హాజరయే అభ్యర్థులు రవాణా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత డిపో మేనేజర్ల సంప్రదించాలని సూచించారు. మద్దిలపాలెం 9959225597, వాల్తేరు 9959225590, కూర్మన్నపాలెం 9959225593, మధురవాడ 8978200455, పాడేరు 9440628092, గాజువాక 9959225590, అనకాపల్లి 9959225595, ద్వారకాకాంప్లెక్సు 9100109731, నర్సీపట్నం 9959225596, విశాఖపట్నం 9959225594, సింహాచలం 9959225592 నంబర్లను సంప్రదించాలని సూచించారు.