కరోనా సాయానికి రూ.30 లక్షల విరాళం
ABN , First Publish Date - 2020-04-08T10:14:09+05:30 IST
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సాయంగా ఫ్లూయెంట్ గ్రిడ్ స్మార్ట్ ఎనర్జీ,
విశాఖపట్నం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సాయంగా ఫ్లూయెంట్ గ్రిడ్ స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ సిటీ టెక్నాలజీ సొల్యూషన్స్ తరఫున రూ.30 లక్షలు సాయం అందించినట్టు సీఈఓ గన్నమనేని మురళీకృష్ణ తెలిపారు. పీఎం సహాయ నిధికి రూ.20 లక్షలు, సీఎం సహాయ నిధికి రూ.10 లక్షలు ఇచ్చామన్నారు. సీఎం సహాయ నిధి చెక్కును రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అందజేశామన్నారు.