విమ్స్ క్వారంటైన్లో 23 మంది
ABN , First Publish Date - 2020-03-23T09:19:25+05:30 IST
విమ్స్ క్వారంటైన్ సెంటర్లో 23 మంది ఉన్నట్టు అధి కారులు తెలిపారు. ఒక్క ఆదివారమే 15 మంది క్వారంటైన్ సెంటర్కు...
విశాఖపట్నం, మార్చి 22, (ఆంధ్రజ్యోతి): విమ్స్ క్వారంటైన్ సెంటర్లో 23 మంది ఉన్నట్టు అధి కారులు తెలిపారు. ఒక్క ఆదివారమే 15 మంది క్వారంటైన్ సెంటర్కు వచ్చారు. వీరంతా గత కొ ద్దిరోజుల వ్యవధిలో వివిధ దేశాల నుంచి నగరానికి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. వీరిలో కరోనా అనుమానిత లక్షణాలు లేనప్పటికీ, వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ పూర్తయ్యే వరకు అంటే 14 రోజుల పాటు క్వారంటైన్ చేయాలన్న ఉద్దేశంతో విమ్స్కు తరలించారు.