ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలి
ABN , First Publish Date - 2020-05-28T09:10:06+05:30 IST
దేశంలోనే మొదటిసారిగా టీడీపీ.. ప్రతిష్టాత్మకంగా ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా ‘మహానాడు’ కార్యక్రమాన్ని నిర్వహించింది
- ‘మహానాడు’లో అచ్చెన్న
కోటబొమ్మాళి, మే 27 : దేశంలోనే మొదటిసారిగా టీడీపీ.. ప్రతిష్టాత్మకంగా ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా ‘మహానాడు’ కార్యక్రమాన్ని నిర్వహించింది. అమరావతి నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆన్లైన్లో వీక్షించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ తీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు.