‘యూబీ పరిశ్రమను తెరిపించాలి’
ABN , First Publish Date - 2020-06-01T11:18:06+05:30 IST
బంటుపల్లిలోని యూబీ పరిశ్రమను తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డి.గోవిందరావు, పి.తేజేశ్వరరావు, సీహెచ్
రణస్థలం: బంటుపల్లిలోని యూబీ పరిశ్రమను తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డి.గోవిందరావు, పి.తేజేశ్వరరావు, సీహెచ్ అమ్మన్నాయుడులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పరిశ్రమ సమీపంలో కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లాక్డౌన్ కాలానికి కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలన్నారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.