వ్యాపారులే మద్దతు ధర చెల్లించాలి

ABN , First Publish Date - 2020-08-09T10:39:21+05:30 IST

మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ నివాస్‌ నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం 80 కిలోల జీడి పిక్కల బస్తాకు రూ.10 వేలు నేరుగా వ్యాపారులే ..

వ్యాపారులే మద్దతు ధర చెల్లించాలి

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 8: మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ నివాస్‌ నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం 80 కిలోల జీడి పిక్కల బస్తాకు రూ.10 వేలు నేరుగా వ్యాపారులే చెల్లించి కొనుగోలు చేయాలని జిల్లా రైతు సమస్యల సాధన కమిటీ గౌరవ అధ్యక్షలు ఉప్పరపల్లి ఉద యకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విలేఖ రులతో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు వ్యాపారుల సమక్షంలోనే  మద్ద తు ధర నిర్ణయిస్తే గ్రామాల్లో వ్యాపారులు మాత్రం రూ.9వేలు లోపే చెల్లి స్తామనడం సరికాదన్నారు. తితలీ తుఫాన్‌, కరోనా విపత్తులతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాల్సిన వ్యాపారులు మరింత దోచే యాలనుకోవడం దుర్మార్ఘమైన చర్యన్నారు. ఇప్పటికైనా వ్యాపారులు ప్రభు త్వం నిర్ణయించిన ధరకు జీడి పిక్కలు కొనుగోలు చేయాలన్నారు. లేకుం టే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం మాజీ ఎంపీటీసీ సభ్యుడు తామడ ఈశ్వరరావు, అగ్నికుల క్షత్రియ మండల ప్రధాన కార్యదర్శి సాన కృష్ణారావు ఉన్నారు. 

Updated Date - 2020-08-09T10:39:21+05:30 IST