-
-
Home » Andhra Pradesh » Srikakulam » TodayToday works should be quality
-
‘నాడు-నేడు’ పనులు నాణ్యతగా ఉండాలి
ABN , First Publish Date - 2020-11-26T05:11:22+05:30 IST
పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనుల్లో నాణ్యతలోపిస్తే చర్య లు తీసుకోవడంతో పాటు బిల్లులు నిలిపివేస్తామని సమగ్ర శిక్షా అభియాన్ చీఫ్ ఇంజనీర్ (విజయవాడ)శ్రీనివాసరావు హెచ్చరించారు.

లేదంటే బిల్లులు నిలిపేస్తాం
ఎస్ఎస్ఏ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు
పొందూరు: పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనుల్లో నాణ్యతలోపిస్తే చర్య లు తీసుకోవడంతో పాటు బిల్లులు నిలిపివేస్తామని సమగ్ర శిక్షా అభియాన్ చీఫ్ ఇంజనీర్ (విజయవాడ)శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం లోలుగు కేజీబీవీలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు పనులను పర్యవేక్షించాలని తెలిపారు. ఆయనతో పాటు ఎస్ఎస్ఏ ఈఈ వి.వెంకటేశ్వరరావు కేజీబీవి ప్రత్యేకాధికారి బి.సుధ ఉన్నారు. ఫ ఇచ్ఛాపురం రూరల్ : పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో బి.వెంకటరమణ తెలి పారు. బుధవారం శాసనం జడ్పీ ఉన్నతపాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, హెచ్ఎం ఎ.చిరంజీవిరావు పాల్గొన్నారు.