అట్రాసిటీ కేసు నమోదు చేయండి
ABN , First Publish Date - 2020-08-08T09:01:26+05:30 IST
తర్లిబొడ్డపాడు గ్రామానికి చెం దిన దళిత మహిళ పునుగోటి కల్పనను కులం పేరుతో దూ షిస్తూ మానసికంగా వేధించిన పూతి చిరంజీవి, పూతి ..
కోటబొమ్మాళి, ఆగస్టు 7: తర్లిబొడ్డపాడు గ్రామానికి చెం దిన దళిత మహిళ పునుగోటి కల్పనను కులం పేరుతో దూ షిస్తూ మానసికంగా వేధించిన పూతి చిరంజీవి, పూతి యర్ర మ్మలపై అట్రాసిటి కేసు నమో దు చేయాలని దళిత ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రామారావు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన దళిత నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి రీత్యా విజయవాడలో భర్త ఉండటం వల్ల ఇద్దరు పిల్లలతో కల్పన ఒంటరిగా ఉండటంతో అగ్రకులానికి చెందిన వలంటీరు చిరంజీవి రెండు నెలలుగా వేధిస్తున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో బాధితురాలు కల్పనతో పాటు పేర నాగేశ్, పిలక చంటి, నగిరి రా ము, పంది రామారావు ఉన్నారు.