రెండు రోజుల వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి
ABN , First Publish Date - 2020-08-14T12:01:28+05:30 IST
మండలంలోని ఓ గ్రామంలో కరోనా లక్షణాలతో తల్లీకొడుకులు కరోనా లక్షణాలతో మృతి చెందా రు. జిల్లా కేంద్రంలోని ఒకే ఆసుపత్రిలో ఇద్దరూ చికిత్స పొందా
వజ్రపుకొత్తూరు, ఆగస్టు 13: మండలంలోని ఓ గ్రామంలో కరోనా లక్షణాలతో తల్లీకొడుకులు కరోనా లక్షణాలతో మృతి చెందా రు. జిల్లా కేంద్రంలోని ఒకే ఆసుపత్రిలో ఇద్దరూ చికిత్స పొందారు. తొలుత కొడుకు (42) సోమవారం మృతి చెందగా.. తల్లి (75) బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తల్లీకొడుకుల మృతితో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది.
కొవ్వొత్తులతో సంతాపం
తల్లీకొడుకులు రెండురోజుల వ్యవధిలో మృతి చెందడంతో గురు వారం గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాజీ సర్పంచ్ గోవిందు పాపారావు ఆధ్వర్యంలో మృతులకు సంతాపం తెలిపారు.