పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
ABN , First Publish Date - 2020-12-10T05:09:29+05:30 IST
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎంపీడీవో పి.సూర్యనారాయణ తెలిపారు.
కవిటి:పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎంపీడీవో పి.సూర్యనారాయణ తెలిపారు. బుధవారం కవిటిలో వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఇంట్లో తడి,పొడి చెత్త వేరుచేసి గ్రీన్ అంబాసిడర్ ద్వారా చెత్తసేకరణ కేంద్రానికి తరలించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.విజయ్కుమార్, ఈవో జి.వెంకటరావు, బి.నాగు పాల్గొన్నారు.ఫ ఇచ్ఛాపురం రూరల్ : ధర్మపురంలో బుధవారం మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పారిశుధ్యంపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యదర్శి కె.రవి మా ట్లాడుతూ చెత్త సేకరణకు ప్రతిఇంటి నుంచి రోజుకు రూ.రెండు చొప్పున్న నెలకు రూ.60 పంచాయతీకి చెల్లించాలని చెప్పారు. ఫసోంపేట: సోంపేటలో మనం - మన పరిశుభ్రత పక్షోత్సవాల్లో భాగంగా పంచాయితీ అధికారులు, వలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్ సదాశివుని గురుప్రసాద్, ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాసరెడ్డి, సోంపేట ఈవో తెంబ వాసు పాల్గొన్నారు. ఫసోంపేట రూరల్ : కొర్లాం పంచాయతీలో వలంటీర్లు, సచివాలయ, వైద్యఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలువునం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎం.శాంతకుమారి పాల్గొన్నారు.