నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ
ABN , First Publish Date - 2020-09-14T09:19:39+05:30 IST
నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్గా వైసీపీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు విమర్శించారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు
రాజాం, సెప్టెంబరు 13: నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్గా వైసీపీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు విమర్శించారు. ఆదివారం రాజాం క్యాం పు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులపై కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలు అందజేయాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలకు భయంపట్టుకుందన్నారు ఎనిమిదేళ్లుగా పెండింగ్లో తమపై ఉన్న కేసులు త్వరగా పరిష్కరించాలని జగన్, విజయసాయి రెడ్డి లేఖ రాయగలరా అని ప్రశ్నించారు. ఇన్ని కేసులు ఉన్న పార్టీగా వైసీపీనే చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.