తాగునీటిని సరఫరా చేయండి
ABN , First Publish Date - 2020-03-27T10:58:06+05:30 IST
పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా
పాలకొండ, మార్చి 26: పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా పట్ట ణంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ తాగునీటిని పూర్తిస్థాయిలో అందించకపోవడంతో మహిళలంతా ట్యాంకరు వద్దకు వచ్చి నీటిని పట్టుకునే పరిస్థితి ఉంది.
గత మూడు రోజులుగా పట్టణంలో దేవరపేట, బోణంవీధ, గొల్లవీధి, శిర్లిపోతన్నవీధి, రెల్లివీధి, జంగాలవీధి తదితర వీధుల్లో కొళాయిల ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. ఆయావీధుల్లోకి వచ్చే మంచినీటి ట్యాంకర్ వద్ద మహిళలు గుంపులు గుంపులుగా చేరి నీటిని పట్టుకునే పరిస్థితి ఉండడంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనిపై ఆర్డీవో, నగరపంచాయతీ ప్రత్యేకాధికారి దృష్టిసారించి ఆయా వీధుల్లో తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసు కోవాలని అంతా కోరుతున్నారు.