ఉపాధ్యాయుల సమస్యలపై అచ్చెన్నకు వినతి

ABN , First Publish Date - 2020-10-28T08:30:24+05:30 IST

రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు టెక్కలి మండల యూటీఎఫ్‌ నా యకులు కోరారు.

ఉపాధ్యాయుల సమస్యలపై అచ్చెన్నకు వినతి

టెక్కలి, అక్టోబరు 27: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు టెక్కలి మండల యూటీఎఫ్‌ నా యకులు కోరారు. ఈ మేరకు మంగళవారం నిమ్మాడలో కలిసి వినతి ప త్రం అందించారు. ఉపాధ్యాయులకు బకాయిపడిన డీఏలు విడుదల చే యాలని, పీఆర్సీ  అందివ్వాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అచ్చెన్నా యుడు స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలవలస ధర్మారావు,  నా యకులు ధవళ వైకుంఠరావు, కురమాన దాలయ్య, తమ్మినేని వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.


కరోనా నిబంధనల మేరకు దీక్షాధారణ చేపట్టండి

కోటబొమ్మాళి: ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పా టిస్తూ అయ్యప్ప, భవానీ, శివ, శ్రీరామ, హనుమాన్‌  దీక్షధారణ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం నిమ్మాడలో అయ్యప్ప దీక్షల నిమిత్తం సన్నిధానా న్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌లు ధరించాలని, కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ, పీఎసీఎస్‌  మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T08:30:24+05:30 IST