భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం
ABN , First Publish Date - 2020-10-13T08:08:06+05:30 IST
పైడిభీమవరం - తిరుపతిపాలెం రూట్లో ఓ ఇంట్లోలో భారీగా ఉన్న గుట్కా నిల్వలను సోమవారం జేఆర్ పురం పోలీసులు స్వాధీనం చే సుకున్నారు.
![భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020101302344247/10132020023800n97.jpg)
రణస్థలం : పైడిభీమవరం - తిరుపతిపాలెం రూట్లో ఓ ఇంట్లోలో భారీగా ఉన్న గుట్కా నిల్వలను సోమవారం జేఆర్ పురం పోలీసులు స్వాధీనం చే సుకున్నారు. ముందస్తు సమా చారం అందుకున్న స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో సభ్యుల సహకారంతో దాడులు చేశారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ దాడిలో ఎం.వెంకటరాజేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా... మరో ఆరుగురు పరారీలో ఉన్నట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.