కరువు ప్రాంతంగా ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-10-03T10:28:39+05:30 IST
పలాస నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరావుయాదవ్, వజ్జ బాబురావు, పీరుకట్ల విఠల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాశీబుగ్గ, అక్టోబరు 2: పలాస నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరావుయాదవ్, వజ్జ బాబురావు, పీరుకట్ల విఠల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ వంశధార నీరు నియోజకవర్గ శివారు భూ ములకు ఇంత వరకు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నా యన్నారు.
దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారని, అందువల్ల కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. పాటు జి.సూర్యనారాయణ, బి. హేమేశ్వర రావు, గంగారాం, కె.సురేష్కుమార్, కృష్ణనాయక్ పాల్గొన్నారు.
అచ్చెన్నకు అభినందనలు
కాశీబుగ్గ: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులు కానున్న మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకి ఆ పార్టీ నాయ కులు లొడగల కామేశ్వరావు యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబురావు తదితరులు అభినందనలు తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మిఠాయి లు పంచుకున్నారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు జి.సూర్యనారా యణ, రవిశంకర్గుప్తా, కె.సురేష్కుమార్, మోహన్రావు, పృధ్వీ, సత్యం, కృష్ణానాయక్, పాండురంగారావు, నవీన్, లోకనాఽథం, కృష్ణారావు, పాపా రావు, జోగారావు, కె.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.