శధార కాలువలో పడి వృద్ధుడు..

ABN , First Publish Date - 2020-10-02T08:59:46+05:30 IST

పెద్దతామరాపల్లి సమీపాన వంశధార ప్రధాన ఎడమ కాలువలో జారిపడి అదే గ్రామానికి చెందిన దివ్యాంగుడు గుణితి లక్ష్మీనారాయణ(64) మృతిచెందాడు.

శధార కాలువలో పడి వృద్ధుడు..

నందిగాం:పెద్దతామరాపల్లి సమీపాన వంశధార ప్రధాన ఎడమ కాలువలో  జారిపడి అదే గ్రామానికి చెందిన దివ్యాంగుడు గుణితి లక్ష్మీనారాయణ(64) మృతిచెందాడు.  కాలువలో కొట్టుకుపోయి కర్లపూడి, మాలపేట గ్రామాల మధ్య కాలువలో మృతదేహం తేలింది. ఈయనకు భార్య లక్ష్మీకాంతం, కుమారుడు జోగారావు, కుమార్తె ఉన్నారు. వీఆర్‌వో ఆర్‌.బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ రవికుమార్‌ కేసు నమోదు చేసి... మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-10-02T08:59:46+05:30 IST