టీడీపీకి పూర్వ వైభవం తెస్తా
ABN , First Publish Date - 2020-10-01T11:08:30+05:30 IST
జిల్లాలో నాయకులు, కార్యకర్తల సాయంతో పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ తెలిపారు.
పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్
పొందూరు, సెప్టెంబరు 30 : జిల్లాలో నాయకులు, కార్యకర్తల సాయంతో పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ తెలిపారు. బుధవారం పొందూరులో అధ్యక్షుడిగా నియమించిన రవికుమార్ను మండలంలో నాయకులు, కార్యకర్తలు సన్మానించారు.
ఈసందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేసేలా శ్రేణులను సిద్ధం చేస్తానని తెలిపారు. జిల్లాలో వైసీపీ ఆగడాలను ఎదుర్కొంటామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా నిలబడతామని హామీఇచ్చారు. అనంతరం పైడితల్లి అమ్మవారు, అక్కమాంబ పేరంటాలు ఆలయాలను దర్శించుకున్నారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కూన సత్యనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎ.రాము, నాయకులు బి. శంకర భాస్కర్, గాడు నారాయణరావు, బాడాన గిరి సీహెచ్ వాసుదేవరావు, టీడీపీ పట్టణాధ్యక్షుడు ఎ. రంగ, కె.శ్రీనివాసరావు, వి.మురళి, డి.గ ణపతి, కె.అప్పలనాయుడు, కె. శ్రీనివాసరావు, ఎస్. శ్రీనివాసరావు పాల్గొన్నారు.