లాక్డౌన్ పాక్షికంగా సడలింపు
ABN , First Publish Date - 2020-09-27T11:09:30+05:30 IST
కరోనా కారణంగా శ్రీకాకుళం నగరంలో ప్రతి ఆదివారం అమలు చేస్తున్న సంపూర్ణ లాక్డౌన్కు సంబంధించి ఈ వారం పాక్షికంగా సడలింపు ఇచ్చినట్లు కలెక్టర్ నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
గుజరాతీపేట, సెప్టెంబరు 26: కరోనా కారణంగా శ్రీకాకుళం నగరంలో ప్రతి ఆదివారం అమలు చేస్తున్న సంపూర్ణ లాక్డౌన్కు సంబంధించి ఈ వారం పాక్షికంగా సడలింపు ఇచ్చినట్లు కలెక్టర్ నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం పాలీసెట్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆహార పానీయాలు, పరీక్షలకు సంబంధించిన పరికరాల దుకాణాలకు అనుమతిచ్చామన్నారు. హోటళ్లతో పాటు ఇతర దుకాణాలు తెరిచే ఉంటాయన్నారు. మాంసాహార దుకాణాలు, మార్కెట్లకు మాత్రం అనుమతి లేదని సృష్టం చేశారు.