స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
ABN , First Publish Date - 2020-12-14T05:08:01+05:30 IST
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని ఎంపీ రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. డొంకూరులో ఇటీవలే ప్రతిష్ఠించిన డొంకనీలమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే బెందాళం అశోక్తో కలిసి ఆదివారం దర్శించుకున్నారు.

ఎంపీ రామ్మోహన్నాయుడు
ఇచ్ఛాపురం రూరల్, డిసెంబరు 13: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని ఎంపీ రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. డొంకూరులో ఇటీవలే ప్రతిష్ఠించిన డొంకనీలమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే బెందాళం అశోక్తో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో టీడీపీకి మంచి రోజులు వస్తాయని తెలిపారు. డొంకూరు గ్రామస్థులు ఉప్పుటేరుపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరిందని, తుఫాన్ రక్షిత భవనం నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపో యిందని, రైతుల భూములు వెబ్ల్యాండ్లో లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారని ఎంపీకి వివరించారు. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డి.ఢిల్లీరావు, మాజీ ఏఎంసీ మాజీ చైర్మన్ సాడి సహదేవు, డి.శ్రీను పాల్గొన్నారు.
రాయితీపై పంపిణీ చేసిన డిజిల్ను కొందరు దుర్వినియోగానికి పాల్పడడంతో వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కపాసుకుద్ధికి చెందిన మత్స్యకారులు బి.గురుమూర్తి, డి.ఢిల్లేసు, బి.సందయ్య, లోహిదాసులు కోరారు.ఈ మేరకు డొంకూరులో ఎంపీ రామ్మోహన్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై ఇప్పటికే జేడీ దర్యాప్తు ప్రారంభించారని ఎంపీ తెలిపారు. కలెక్టర్ను కలసి సమస్యను వివరించి న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.