పట్టాలు మంజూరు చేయాలి
ABN , First Publish Date - 2020-12-05T05:19:04+05:30 IST
చిలకపాలెం పరిధిలోని నారాయణపురం భూములను ఏళ్ల తరబడి సాగుచేస్తున్న రైతులకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు.
ఎచ్చెర్ల: చిలకపాలెం పరిధిలోని నారాయణపురం భూములను ఏళ్ల తరబడి సాగుచేస్తున్న రైతులకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎచ్చెర్లలో శుక్రవారం రిలే దీక్షలు ప్రారంభించారు. నారాయణపురం పరిధిలో 170 ఎకరాల భూములను ఇక్కడి రైతులు సాగుచేస్తున్నారని, వీరికి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కార్యక్ర మంలో వివిధ సంఘాల నాయకులు కె.మోహనరావు, డి.గోవిందరావు, పి.తేజేశ్వ రరావు, సీహెచ్.అమ్మన్నాయుడు తోనంగి నందోడు తదితరులు కూర్చొన్నారు.