నేటి నుంచి బెంగుళూరుకు బస్సులు

ABN , First Publish Date - 2020-12-30T05:12:23+05:30 IST

పులివెందుల నుంచి బెంగు ళూరుకు బుధవారం నుంచి బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అసి స్టెంట్‌ డీఎం ప్రవీణ్‌ తెలిపారు.

నేటి నుంచి బెంగుళూరుకు బస్సులు

పులివెందుల రూరల్‌, డిసెంబరు 29: పులివెందుల నుంచి బెంగు ళూరుకు బుధవారం నుంచి బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అసి స్టెంట్‌ డీఎం ప్రవీణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా రోజూ ఉదయం 5:30గంటలకు, 7:30గంటలకు, రాత్రి 11గంటలకు పులివెందుల నుంచి బెంగుళూరు బస్సులు బయలు దేరుతాయన్నారు.

అలాగే బెంగుళూరు నుంచి ఉదయం 10గంటలకు, మధ్యాహ్నం 2:45గంటలకు, రాత్రి 7గం టలకు పులివెందులకు బస్సులు ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2020-12-30T05:12:23+05:30 IST