రెండు నర్సింగ్ హోమ్ల మూత
ABN , First Publish Date - 2020-09-20T10:36:45+05:30 IST
ఇచ్ఛాపురంలో రిజిస్ర్టేషన్ లేకుండా నడుపుతున్న అమ్మ, నందిని నర్సింగ్హోమ్లను అధికారులు మూసివేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇవి నడుస్తున్నట్టు గుర్తించారు.

అనుమతి లేకుండా నిర్వహణ
ప్రైవేటు ఆసుపత్రులకు రిజిస్ర్టేషన్ తప్పనిసరి
డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ లీల
(ఇచ్ఛాపురం, సెప్టెంబరు 19):
ఇచ్ఛాపురంలో రిజిస్ర్టేషన్ లేకుండా నడుపుతున్న అమ్మ, నందిని నర్సింగ్హోమ్లను అధికారులు మూసివేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇవి నడుస్తున్నట్టు గుర్తించారు. ప్రైవేటు ఆసుపత్రులకు రిజిస్ర్టేషన్ తప్పనిసరని, లేకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు క్లినిక్లను సీజ్ చేస్తామని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ లీల హెచ్చరించారు. శనివారం ఇచ్ఛాపురంలో ఐదు ప్రైవేటు నర్సింగ్ హోమ్లను తనిఖీ చేశారు.
వీటిలో రెండింటికి అనుమతి లేదని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా వైద్యం చేస్తే ప్రైవేటు ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇచ్ఛాపురంలో ప్రైవేటు వైద్యులు రిజిస్ర్టేషన్లు లేకుండా క్లినిక్లు నడుపుతున్నారని తెలిపారు. కొందరు హోమియోపతి సర్టిఫికెట్లతో అల్లోపతి వైద్యం అందిస్తున్నారని చెప్పారు
. పట్టణానికి చెందిన కొయ్యి పద్మనాభం రెడ్డి ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రైవేటు ఆసుపత్రులు తనిఖీ చేశామని తెలిపారు. అనుమతి లేని ఆస్పత్రులపై విచారణకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.