తితలీ పరిహారం చెల్లించండి
ABN , First Publish Date - 2020-12-25T05:56:27+05:30 IST
అధికారంలోకి వస్తే పరిహారం రెట్టింపు చేస్తామని చెప్పి, ఆ విషయాన్నే మరిచిపోవడం అన్యాయమని జనసేన పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్చార్జి దాసరి రాజు అన్నారు.
![తితలీ పరిహారం చెల్లించండి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122512245457/12252020002556n97.gif)
సోంపేట: అధికారంలోకి వస్తే పరిహారం రెట్టింపు చేస్తామని చెప్పి, ఆ విషయాన్నే మరిచిపోవడం అన్యాయమని జనసేన పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్చార్జి దాసరి రాజు అన్నారు. తితలీ పరిహారం చెల్లించాలంటూ సోంపేటలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీజేపీ యువమోర్చ జిల్లా అధ్యక్షుడు బీన వంశీ సంఘీభావం తెలిపాడు. ఈదీక్షలో వూనా పాండురంగారావు, కె.రవి, ఎల్.శైలజ, ప్రదీప్, సంతోష్ పాల్గొన్నారు. అయితే దీక్ష శిబిరంలోని టెంటను తొలగించినప్పటికీ ఎండలోనే దీక్షను కొనసాగించారు.