పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

ABN , First Publish Date - 2020-05-09T09:21:46+05:30 IST

అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలోని పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్‌ కూన

పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

వీసీ ప్రొఫెసర్‌ రాంజీ 


ఎచ్చెర్ల, మే 8:  అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలోని పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్‌ కూన రాంజీ తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిన తరగతులను ఆన్‌లైన్‌లో పూర్తిచేస్తున్నామన్నారు. అలాగే ఆన్‌లైన్‌లో మిడ్‌ ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రం లోని పలు వర్సిటీలకు మూడో వంతు సిబ్బందితో భౌతిక దూరం పాటించి విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు.


ఈ మేరకు అంబేడ్కర్‌ వర్సిటీకి కూడా ఆదేశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత వర్సిటీ ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ సెమెస్టర్‌ పరీ క్షలను నిర్వహిస్తామన్నారు. జూన్‌ 1, 15, జూలై 1 మూడు స్లాట్లుగా విభజించి పరీక్షల నిర్వహణకు సమాయత్తమవుతున్నట్టు చెప్పారు. వర్సిటీలో సిబ్బందితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి భవిష్యత్‌ కార్యచరణపై చర్చించారు. 

Updated Date - 2020-05-09T09:21:46+05:30 IST