లారీ డ్రైవర్‌ దుర్మరణం!

ABN , First Publish Date - 2020-12-08T04:54:13+05:30 IST

ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ప్రాంగణంలోని వెనుక భాగం అది. సోమవారం ఉదయం వసతిగృహాలు, అడ్మిన్‌ భవన నిర్మాణ పనుల కోసం స్థలాన్ని చదును చేస్తున్నారు. పోగుచేసిన మట్టిని ఇదే ప్రాంగణంలో వేరేచోట లారీతో డంప్‌ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మట్టిలోడుతో వెళ్లిన లారీ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. కూతవేటు దూరం కావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు వెళ్లిచూడగా.. లారీ చెంతనే గుర్తుపట్టలేని విధంగా డ్రైవర్‌ మృతదేహం కనిపించింది. లారీ పైభాగాన్ని తాకుతూ హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు ఉన్నాయి. దీంతో విద్యుదాఘాతంతో లారీడ్రైవర్‌ మృతిచెందినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

లారీ డ్రైవర్‌ దుర్మరణం!
రోదిస్తున్న మృతుడి కుటుంబ సభ్యులు, ఇన్‌సెట్లో సంతోష్‌ (ఫైల్‌ఫోటో)

విద్యుదాఘాతమే కారణం

వాహనం చెంతనే గుర్తుపట్టలేని విధంగా మృతదేహం

ఎచ్చెర్ల, డిసెంబరు 7: ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ప్రాంగణంలోని వెనుక భాగం అది. సోమవారం ఉదయం వసతిగృహాలు, అడ్మిన్‌ భవన నిర్మాణ పనుల కోసం స్థలాన్ని చదును చేస్తున్నారు. పోగుచేసిన మట్టిని ఇదే ప్రాంగణంలో వేరేచోట లారీతో డంప్‌ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మట్టిలోడుతో వెళ్లిన లారీ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. కూతవేటు దూరం కావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు వెళ్లిచూడగా.. లారీ చెంతనే గుర్తుపట్టలేని విధంగా డ్రైవర్‌ మృతదేహం కనిపించింది. లారీ పైభాగాన్ని తాకుతూ హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు ఉన్నాయి. దీంతో విద్యుదాఘాతంతో లారీడ్రైవర్‌ మృతిచెందినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతిచెందిన లారీ డ్రైవర్‌ డొంక సంతోష్‌ (32)గా గుర్తించారు.  మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడిది ఎచ్చెర్ల మండలం చిలకపాలెం. ఈయనకు భార్య రేవతి, ఇద్దరు పిల్లలు జ్యోతీష్‌, హరీష్‌ ఉన్నారు. సంతోష్‌ మృతిచెందాడని తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. గ్రామ పెద్దల సమక్షంలో శవపంచనామా చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

   

Updated Date - 2020-12-08T04:54:13+05:30 IST