ఇంటర్ మూల్యాంకనం వాయిదా
ABN , First Publish Date - 2020-03-21T09:45:11+05:30 IST
ఇంటర్మీడియట్ మూల్యాంకనం వాయిదా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి విజృంబిస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలో
![ఇంటర్ మూల్యాంకనం వాయిదా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నరసన్నపేట, మార్చి 20: ఇంటర్మీడియట్ మూల్యాంకనం వాయిదా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి విజృంబిస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలో అధ్యాపకులు స్పాట్ను బహిష్కరించారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఈనెల 21నుంచి 31 వరకు తాత్కాలికంగా ప్రశ్నపత్రాలు దిద్దుబాటును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిలుపదల చేస్తున్నట్లు ఆర్ఐవో ఎస్.రుక్మాంగధరావు చెప్పారు.