డీజిల్‌ దుర్వినియోగంపై విచారణ

ABN , First Publish Date - 2020-12-11T05:14:10+05:30 IST

కపాసుకుద్దిలో మత్స్యకారులకు ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసిన డీజిల్‌ దుర్వినియోగంపై మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు.

డీజిల్‌ దుర్వినియోగంపై విచారణ
కపాసుకుద్దిలో మత్స్యకారులతో మాట్లాడుతున్న జేడీ శ్రీనివాసరావు


 బాధ్యులపై కఠిన చర్యలు

మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు

కవిటి: కపాసుకుద్దిలో మత్స్యకారులకు ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసిన డీజిల్‌ దుర్వినియోగంపై మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం మత్స్యకారుల కోసం రాయితీపై డీజిల్‌ను సరఫరాచేస్తోంది. ఈ డీజిల్‌ను కొందరు దుర్వినియోగానికి పాల్పడ్డారని కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు గురువారం కవిటి మండలంలోని కపాసుకుద్దిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా  శ్రీనివాసరావు  మాట్లాడుతూ రాయితీ డీజిల్‌ దుర్వినియెగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లబ్ధిదారులకు విచారించినట్లు తెలిపారు. సొసైటీ అధ్యక్షుడు బడేనాయుడు లబ్ధిదారులకు మభ్యపెట్టి  రాయితీ డీజిల్‌ దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోందని చెప్పారు. లోతుగా విచారణ నిర్వహించి, ఆయన వెనుక ఎవరున్నా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో మత్స్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని చెప్పారు. కార్యక్రమంలో పలాస ఏడీ గోపీకృష్ణ, కళింగపట్నం, ఇచ్ఛాపురం ఎఫ్‌డీవోలు బి.సురేష్‌, రవితేజ పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-11T05:14:10+05:30 IST