కంచిలిలో గుట్కా పట్టివేత
ABN , First Publish Date - 2020-11-03T05:30:00+05:30 IST
కంచిలిలో గుట్కా, ఖైనీ ప్యాకెట్లను మంగళవారం స్వాధీనం చేసు కున్నామని ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
కంచిలి : కంచిలిలో గుట్కా, ఖైనీ ప్యాకెట్లను మంగళవారం స్వాధీనం చేసు కున్నామని ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. కంచిలిలో మెయిన్ రోడ్డులో ఒడిశాలో ని పాత్రపురానికి చెందిన త్రినాథరావు, కంచిలికి చెందిన భీమారావు వద్ద రూ.12,824 విలువ గల గుట్కా, ఖైనీ పట్టుకున్నామన్నారు. రైల్వేస్టేషన్ ఎదురుగా గోపాలరావు, తిరుమల, త్రినాఽథరావు వద్ద రూ.37,650 విలువ గల ఖైనీ, గుట్కా, పొడుము ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.