ఏపీలో కొందరు పోలీసుల అత్యుత్సాహం.. రోడ్డుపై ఉన్న రైతుల బైక్‌లను..

ABN , First Publish Date - 2020-03-28T00:20:30+05:30 IST

లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీలో కొన్నిచోట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో...

ఏపీలో కొందరు పోలీసుల అత్యుత్సాహం.. రోడ్డుపై ఉన్న రైతుల బైక్‌లను..

రావిపాడు: లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీలో కొన్నిచోట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో పెరవలి ఎస్‌ఐ లాఠీఛార్జ్ ఉదంతం మరువక ముందే మరో ఘటన జరిగింది. రైతులు పొలానికి వెళ్లి పనులు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పొలం పనికి వెళ్లిన రైతులు వారి బైక్‌లను రోడ్డుపై నిలిపివెళ్లగా వాటిని ధ్వంసం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా రావిపాడులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇనుపకడ్డీలతో బైక్‌ హెడ్‌లైట్‌లను, బైక్ భాగాలను ధ్వంసం చేస్తున్న వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. ఇదేంటని అడిగిన రైతులపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు.

Updated Date - 2020-03-28T00:20:30+05:30 IST