నిబంధనల మేరకు ఉపాధి పనులు
ABN , First Publish Date - 2020-05-17T10:30:14+05:30 IST
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధి పనులు చేపట్టాలని ఎంపిడీవో జి.శ్యామల కుమారి తెలిపారు.

జలుమూరు, మే 16: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధి పనులు చేపట్టాలని ఎంపిడీవో జి.శ్యామల కుమారి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వేతనదారులకు శనివారం సబ్బులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి పనికి వెళ్లేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, పనికి వెళ్లేముందు, పని ముగించిన తరువాత చేతులను సబ్బుతో కడుక్కోవాలన్నారు. భౌతిక దూరం పాటించాలన్నారు. ఏపీవో బాబూరావు, ఈసీ పి.సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భౌతిక దూరం పాటించండి
మెళియాపుట్టి: ఉపాధి వేతనదారులు పనుల సమయంలో భౌతిక దూరం పాటించాలని ఏపీవో సురేష్ కోరారు. శనివారం ఽధీనబందుపురం పంచా యతీలో పనులను పరిశీలించారు. వేసవికాలం జాగ్రత్తలు తీసుకో వాల ని సూచించారు. మొక్కలు కా వా ల్సిన రైతులు దరఖాస్తులు చేసు కోవాలని కోరారు.
పనులు కల్పించండి
హిరమండలం: వంశధార రిజర్యాయర్ నిర్మా ణానికి సేకరించిన భూసేకరణ చేపట్టగా మిగిలి ఉన్న భూముల్లో ఉపాధి పనులు చేపట్టాలని పెద్దసంకిలికి చెందిన నిర్వాసితులుఎంపీడీవో ప్రభావతిని కోరారు. ఈ మేకు శనివారం ఆమెను కలిసి వినతిపత్రం అం దించారు. పెద్దసంకిలి మిగులు భూముల్లో నలభై కుటుంబాలు ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నా మని చెప్పారు. ఇక్కడ ఎటువంటి కూలి పనులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, తక్షణం 207 ఎకరాల మిగులు భూముల్లో ఉపాధి పనులు కల్పించి ఆదుకోవాలని కోరారు.