‘ఉపాధ్యాయ ఖాళీలు బ్లాక్‌ చేయవద్దు’

ABN , First Publish Date - 2020-12-15T06:19:38+05:30 IST

ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీలను బ్లాక్‌ చేయకుండా అన్ని చూపించాలని ఫో రం రిజిస్టర్‌ టీచ ర్స్‌ ఆర్గనైజేషన్‌ (పీఆర్‌టీవో) రాష్ట్ర నాయకుడు, ఏపీ ఒడియా టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బృందావన్‌ దొళాయి డిమాండ్‌ చేశారు.

‘ఉపాధ్యాయ ఖాళీలు బ్లాక్‌ చేయవద్దు’

కవిటి: ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీలను బ్లాక్‌ చేయకుండా అన్ని చూపించాలని ఫో రం రిజిస్టర్‌ టీచ ర్స్‌ ఆర్గనైజేషన్‌ (పీఆర్‌టీవో) రాష్ట్ర నాయకుడు, ఏపీ ఒడియా టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బృందావన్‌ దొళాయి డిమాండ్‌ చేశారు. సోమవారం సహలాలపుట్టుగ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రమోద్‌ కుమార్‌ పాడి, రుక్కు ప్రధాన, ప్రసన్న లిమ్మాయి, త్రిలోచన పొల్లాయి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:19:38+05:30 IST