కార్మికులకు వైద్య పరీక్షలు చేయండి
ABN , First Publish Date - 2020-05-11T10:49:40+05:30 IST
మునిసిపల్ కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు కోరారు
![కార్మికులకు వైద్య పరీక్షలు చేయండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పాలకొండ: మునిసిపల్ కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు కోరారు. ఆదివారం నగర పంచా యతీ కార్యాలయ ఆవరణలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులతో నిరసన తెలిపారు. అత్యవసర సేవలు అందజేస్తున్న కార్మికులకు నెల జీతం బోనస్గా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో పి.వేణు, సీహెచ్.సురేష్, శ్రీనివాస రావు, నర్సింగ్, హరిబాబు, రాజు, అరవింద్, సాయి, సతీష్, లక్ష్మి పాల్గొన్నారు.