ఇంటర్లో ప్రవేశానికి 25 వరకు గడువు
ABN , First Publish Date - 2020-08-01T10:24:24+05:30 IST
ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రఽథమ సంవత్సరంలో ప్రవేశానికి ఆగస్టు 25వ తేదీ వరకు గడువు పెంచుతూ జాయింట్..

ఈదులవలస(పోలాకి), జూలై 31: ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రఽథమ సంవత్సరంలో ప్రవేశానికి ఆగస్టు 25వ తేదీ వరకు గడువు పెంచుతూ జాయింట్ డైరక్టర్ డి.మదుసూదనరావు నుంచి ఆదేశాలు వచ్చాయని ఈదులవలస కళాశాల ప్రిన్సిపాల్ ఇంజరాపు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 విద్యాసంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. దరఖాస్తులను ఆన్లైన్లోనే నమోదు చేయాలన్నారు. అలాగే ఆరో తగగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే గడువు ఆగస్టు 5వ తేదీ వరకు పెంచినట్లు చెప్పారు.