జిల్లాను విభజిస్తే భావితరాలకు నష్టం

ABN , First Publish Date - 2020-12-18T05:05:14+05:30 IST

జిల్లాను విభజిస్తే భావితరాల నష్టం వాటిళ్లనుందని సమైక్య సిక్కోలు గర్జన జేఏసీ జిల్లా అధ్యక్షుడు పైడి నవీన్‌కుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

జిల్లాను విభజిస్తే భావితరాలకు నష్టం
మాట్లాడుతున్న నవీన్‌కుమార్‌


  సమైక్య సిక్కోలు గర్జన జేఏసీ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్‌

సరుబుజ్జిలి: జిల్లాను విభజిస్తే భావితరాల  నష్టం వాటిళ్లనుందని సమైక్య సిక్కోలు గర్జన జేఏసీ జిల్లా అధ్యక్షుడు పైడి నవీన్‌కుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం సరుబుజ్జిలిలో  సమైక్య సిక్కోలు గర్జనసభను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమైక్యతకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. విద్యావంతులైన యువత, మేధావులు ముందుకురావాలన్నారు. ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లోని పరిశ్రమలు,  కార్పొరేట్‌ ఆసుపత్రులు విజయనగరం జిల్లాలో  కలిపితే చాలా నష్టం   వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. జిల్లా విభజన  జరగకుండా ఉద్యమాన్ని  ఉధృతం చేస్తామని తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ బి.భాస్కరరావు, మండల కన్వీనర్‌ యండ రామారావు,  ప్రిన్సిపాల్‌ కూన జగన్నాథం పాల్గొన్నారు. 



 

Updated Date - 2020-12-18T05:05:14+05:30 IST